ఈ మధ్య కొన్ని బ్లాగులు వాటిలో వాదాలు మరి కొన్ని పోస్టులు చదివిన తర్వాత గమ్యం సినిమాలో ఒక సీన్ గుర్తు వచ్చింది.
GAMYAM
అందులో బ్రహ్మానందం ప్రమాదం జరిగిన చోట ఈ డైలాగులు చెప్తుంటాడు.మన సమాజం లో ఇలాంటి వాళ్ళకు కొదవలేదు. సమస్యలు లేని దేశం ఉండదు అసమానతలు లేని సమాజం ఉండదు.కాని వీళ్ళకు మన దేశం మాత్రమే ప్రపంచం లో అత్యంత పనికిమాలిన దేశంగా కనిపిస్తుంటుంది.వీళ్ళు ఎక్కడా మంచిని చూడలేరు ఎందుకంటే మనసులో ద్వేషభావాలు నిండిపోయిన వాళ్ళకు మంచి ఎక్కడా కనబడదు.ప్రతి సంస్క్రుతి వీళ్ళకు పనికి మాలినదిగానే కనిపిస్తుంది.పోనీ వీళ్ళు దేశాన్ని ఉద్దరించే పనులు ఏమైనా చెస్తారా అంటే అదిలేదు, చేసే వాళ్ళను సూటిపోటి మాటలతో వేధించడం, వళ్ళ నమ్మకాలను ఎగతాళీ చేయడం ఎంట్రా అంటే అది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనడం.
సమస్యలను చిటికెలో పరిష్కరించడానికి ఇది నలుగురున్న ఇల్లు కాదు, వంద కోట్ల జనాభా ఉన్న దేశం.దానికి కాస్త సమయం కావాలి, ఇలాంటి రాజకీయ నాయకులు, మేధావులని చెప్పుకొనే ఇలాంటి వెధవలు ఉన్న దేశానికి అది ఇంకా కష్టం, ఎందుకంటే వీళ్ళు చెసే పని అల్లా ఒక్కటే మానుతున్న గాయాలను మళ్ళీ మళ్ళీ కెలకడం, ప్రజల్లో ద్వేషాలను రెచ్చకొట్టడం. నా ద్రుష్టిలో వీళ్ళకు తాలిబన్లకు పెద్ద తేడా లేదు.మనం చేయగలిగిందల్లా ఇలాంటి పెంటకు దూరంగా ఉండటం.All we can do is ignore such fools.
Subscribe to:
Post Comments (Atom)
హ్మం
ReplyDeleteఅత్యద్భుతం ! చాల చాల చక్క గ చెప్పారు .
ReplyDelete.........మీ సావిరహే